మరో 5 రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న వేళ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బంధు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నియమావళి కొనసాగుతున్న వేళ ఈసీ అనుమతి దక్కుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే రైతుబంధు విడుదలకే ఈసీ మొగ్గుచూపింది.
ఈసీ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రైతుబంధు నిధులు పంపిణీకి ప్రభుత్వానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పటికే పంపిణీ చేయాల్సి ఉన్నా ఎన్నికల నియమావళి కారణంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా క్లియరెన్స్ రావడంతో రైతులతోపాటు బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎన్నికలకు కేవలం 5 రోజుల ముందే రైతుబంధు పంపిణీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ప్రతిపక్షాలు ఏవిధంగా స్పందిస్తాయో వేచిచూడాలి.