రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ షాక్తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ హృదయ విదారక ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. గురువారం రాత్రి రాజస్థాన్ రాష్ట్రం లోని సలాంబర్ జిల్లా లోని లసాదియా ప్రాంతంలో విద్యుత్ షాక్తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఇది గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
సలాంబర్ డీఎస్పీ దుంగార్సింగ్ మాట్లాడుతూ.. బోడ్ ఫల్లాలో నివాసముంటున్న ఉంకర్ మీనా ఇంట్లో విషాదం నెలకొందని.. ఇంటి సమీపం లోని విద్యుత్ స్తంభంలో షార్ట్ సర్క్యూట్ సంభవించిందని.. అది ఇంటి ఇనుప గేటు వైర్కు తాకిందని.. దీనితో 68 ఏళ్ల ఉంకర్ మీనా , అతని భార్య భన్వారీ (65) కూడా విద్యుదాఘాతానికి గురైయ్యారని, తల్లిదండ్రులను రక్షించడానికి ప్రయత్నించిన అతని 25 ఏళ్ల కుమారుడు దేవి లాల్ అలానే అతని 22 ఏళ్ల (వివాహిత) కుమార్తె కూడా విద్యుదాఘాతానికి గురయ్యారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ షాక్తో నలుగురు మృతి చెందినట్లు ఆయన తెలిపారు. కాగా ఈ ఈ ఘటనపై ఇరుగుపొరుగు వారు అతనికి సమాచారం అందించారని. అనంతరం పోలీసులకు, జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించామని, నలుగురి మృతదేహాలను ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచామని తెలిపిన ఆయన..శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగింస్తామని తెలిపారు.









