AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు..

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసింది. నవంబర్‌ 2న విచారణకు హాజరుకావాలని నోటీసులు కోరింది. లిక్కర్‌ పాలసీ వ్యవహారంలో ఏప్రిల్‌లో కేజ్రీవాల్‌ను సీబీఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా ఈడీ సైతం విచారణకు పిలిచింది. ఎక్సైజ్‌ పాలసీ వ్యవహారంలో సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసు ఆధారంగా ఈడీ సైతం విచారణ జరుపుతున్నది. ఇదిలా ఉండగా.. ఇదే కేసులో ప్రస్తుతం ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్‌ను ఇవాళ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆరు నుంచి ఎనిమిది నెలల్లో కేసు విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది. విచారణ ఆలస్యమైతే సిసోడియా మళ్లీ బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది.

ANN TOP 10