AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేపు తిరుమల ఆలయం మూసివేత

తిరుపతి: పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని శనివారం మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దాదాపు 8 గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంచనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ నెల 29న తెల్లవారుజామున 1.05 నుంచి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఉంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందు తలుపులు మూసివేయడం ఆనవాయితి ఉంది. ఈ నేపథ్యంలో 28వ తేదీ రాత్రి 7.05 గంటలకు ఆలయ తలుపులు మూతపడనున్నాయి. తెల్లవారుజామున 3.15 గంటలకు సంప్రోక్షణ, సుప్రభాతసేవ అనంతరం ఆలయ తలుపులు తెరుస్తారు. గ్రహణం కారణంగా 28న స్వామివారిని దర్శించుకునేందుకు సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు, వృద్ధులకు సౌకర్యాలు రద్దు చేసినట్లు తిరుమల దేవస్థానం తెలిపింది.

ANN TOP 10