AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌కు అమిత్ షా… నేడు సూర్యాపేట సభలో పాల్గొనున్న కేంద్రమంత్రి

కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. నేడు సూర్యాపేటలోని బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఇందుకోసం గురువారం రాత్రికే ఆయన చేరుకున్నారు. రాత్రి నేషనల్ పోలీస్ అకాడమీలో ఆయన బస చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి గం.11 వరకు 75వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌‌లో పాల్గొంటారు.

మధ్యాహ్నం గం.3కు సూర్యాపేటకు బయలుదేరుతారు. సాయంత్రం గం.4 నుంచి గం.5 వరకు సూర్యాపేట బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం గం.5.45 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనం అవుతారు. మధ్యలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడవుతాయి.

ANN TOP 10