సోమవారం రాత్రి తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగింపు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేవీ నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో ఎనిమిదో రోజున కనక దుర్గమ్మ దుర్గాదేవిగా భక్తులను కరుణిస్తున్నారు. ఈ ఏడాది ఉత్సవాలు మాత్రం 9 రోజుల్లోనే ముగుస్తున్నాయి. దసరా రోజున సోమవారం రెండు అలంకాారాలు ఉంటాయి. తెప్పోత్సవంతో ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. మూలా నక్షత్రం నుంచి భక్తుల రాక భారీగా పెరిగింది.









