‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకొని భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని విశ్వవేదికపై ఘనంగా చాటింది. దేశానికి తొలి ఆస్కార్ను అందించిన చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ చరిత్ర సృష్టించింది. ఇక ఈ చిత్రంతో టాలీవుడ్ స్టార్ నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ లెవల్లో ఓ రేంజ్ పాపులారిటీని సంపాదించుకున్నారు. కాగా, తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే మూమెంట్ ఇది. ఆస్కార్ కమిటీ ఎన్టీఆర్కు ఓ అరుదైన గౌరవాన్ని అందించింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ కమిటీలోని నటుల కేటగిరీలోకి ఎన్టీఆర్ను చేర్చింది. ఈ విషయాన్ని అకాడమీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు ఎన్టీఆర్ను కొత్త అకాడమీ మెంబర్గా పరిచయం చేస్తూ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట సమయంలోని విజువల్స్ను షేర్ చేసింది. ప్రస్తుతం అకాడమీ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదో ప్రౌడ్ మూమెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
