AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రోడ్డు ప్రమాదంలో కొండా సురేఖకు గాయాలు..

బైక్ ర్యాలీ సందర్భంగా అదుపుతప్పిన సురేఖ నడుపుతున్న స్కూటీ
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే, రాహుల్ గాంధీ చేపట్టిన బస్సు యాత్రలో ఆమె పాల్గొన్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆమె వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ర్యాలీలో సురేఖ స్వయంగా స్కూటీని నడిపారు. ఈ సందర్భంగా స్కూటీ అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె కుడి కన్ను పైభాగానికి చేతికి గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సురేఖ గాయపడిన విషయం తెలుసుకున్న ఆమె భర్త కొండా మురళి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. గాయపడ్డ భార్యను చూసి ఆయన కంటతడి పెట్టుకున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10