AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు జనగామకు కేసీఆర్‌ రాక

బీఆర్‌ఎస్‌ అధి నేత, సీఎం కేసీఆర్‌ సోమవారం జనగామకు వస్తున్నారు. సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జిల్లాకేం ద్రంలో జరిగే ప్రజాఆశీర్వాద సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన జనగామకు చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం సభ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొట్టమొదటి బ హిరంగ సభ కావడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ సవాల్‌గా తీసు కుంది. జనగామ నియోజకవర్గవ్యాప్తంగా భారీగా జనసమీ కరణకు ప్లాన్‌ చేసింది. కేసీఆర్‌ సభకు లక్ష మందిని తర లిస్తామని బీఆర్‌ఎస్‌ పార్టీ చెబుతోంది.

పెద్ద ఎత్తున ఏర్పాట్లు
కేసీఆర్‌ సభ కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్ద ఎత్తున ఏ ర్పాట్లు చేసింది. జిల్లాకేంద్రంలోని సిద్ధిపేట రోడ్డుకు ఉన్న 18.23 ఎకరాల మెడికల్‌ కాలేజీ స్థలంలో సభను ఏర్పాటు చేస్తున్నారు. సభా వేదికతో పాటు ముఖ్యులు కూర్చునేం దుకు జర్మన్‌ టెక్నాలజీతో కూడిన టెంటు వేశారు. ఇందులో సుమారు 10వేల మంది కూర్చునే అవకాశం ఉంది. 200మంది కూర్చునేలా భారీ వేదికను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ప్రజల కోసం భారీ టెంట్లు వేశారు. సభకు లక్ష మంది వస్తారని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. వారి కోసం 2లక్షల మజ్జిగ, 2లక్షల వాటర్‌ ప్యాకెట్లను అందు బాటులో ఉంచారు. ఎండ తీవ్రత వల్ల ఎవరైనా సొమ్మసి ల్లి పడిపోతే ప్రథమ చికిత్స అందించేందుకు రెండు ఆంబులెన్సులను సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్‌ రాక కోసం సభా ప్రాంగణానికి 200మీటర్ల దూరంలో హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. అక్కడ దిగిన తర్వాత కేవలం 4 నిమిషా ల్లోపే సభా వేదికపైకి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

ANN TOP 10