స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వచ్చే మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణను వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదనలను వినిపించారు. ఫైబర్ నెట్ కేసులో బెయిల్ పై ఇదే బెంచ్ ముందు ప్రస్తుతం వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ కేసుకు కూడా 17ఏ వర్తిస్తుందని సిద్ధార్థ్ లూథ్రా తెలిపారు.
