AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కారులో కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావటంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో పోలీసులు ఎక్కడిక్కకడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. హైదరాబాద్‌లో కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.3.35 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి కారు, నగదు లెక్కించే యంత్రం స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు 3లో వాహనాలు తనిఖీ చేపట్టారు. అయితే ఓ కారులో నలుగురు వ్యక్తులు భారీగా డబ్బుతో వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.3.35 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. డబ్బను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులు చిత్తూరు జిల్లాకు చెందిన సీహెచ్‌.హనుమంతరెడ్డి , బి.ప్రభాకర్‌, ఎం. శ్రీరాములు రెడ్డి, ఎం.ఉదయ్‌కుమార్‌ రెడ్డిగా గుర్తించారు. ప్రధాన సూత్రధారి హనుమంత రెడ్డి ప్రైవేటు ఉద్యోగాన్ని వదిలేసి మిగిలిన ముగ్గురితో కలసి హవాలా దందా ప్రారంభించినట్లు తెలిసింది.

ఇక సికింద్రాబాద్‌లో రూ.50 లక్షల నగదు, బంగారం, వెండి ఆభరణాలతోపాటు రూ.12.15 లక్షల విలువైన మద్యం బాటిళ్లను పోలీసులు తనిఖీల్లో పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో రూ.9.4 లక్షలు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రూ.6.50 లక్షలు, నిజామాబాద్‌ జిల్లా మహారాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద రూ.5.60 లక్షలు, పెద్దపల్లి జిల్లాలో రూ.3 లక్షలు, వనపర్తి జిల్లా కొత్తకోటలో రూ.2.35 లక్షలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో రూ.2 లక్షల నగదును పోలీసులు సీజ్‌ చేశారు. సరైన పత్రాలు చూపించి నగదును తీసుకెళ్లాలని సూచించారు.

ANN TOP 10