AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఐదేళ్ల బాలుడి కిడ్నాప్..

సికింద్రాబాద్‌ రైల్వేష్టేషన్‌లో చిన్నారి కిడ్నాప్‌ కలకలం రేగింది. ఒకటో నెంబర్‌ ఫ్లాట్‌పాంపై ఐదేళ్ల బాలుడు అపహరణకు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే బాలుడిని బెగ్గింగ్ మాఫియా అపహరించి ఉండొచ్చునన్న అనుమానాలు తలెత్తున్నాయి. దీంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయాలపురానికి చెందిన దుర్గేష్ తన ఐదేళ్ల కుమారుడితో కలిసి తిరుమల వెళ్లాడు. దర్శనం అనంతరం ఈ నెల 28న తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు తిరుగుపయనమయ్యాయి. సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వచ్చిన అనంతరం.. బాలుడిని ఒకటో నెంబర్‌ ఫ్లాట్‌ఫామ్‌పై ఉంచి దుర్గేష్ వాష్‌రూమ్‌కు వెళ్లాడు. తిరిగొచ్చేసరికి బాలుడు కనిపించకపోవడంతో.. వెంటనే స్టేషన్‌లోని జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. ఇద్దరు వ్యక్తులు బాలుడిని ఎత్తుకెళ్తున్నట్లు స్పష్టంగా రికార్డయింది. బాలుడి మానసిక స్థితి సరిగా లేదని తండ్రి దుర్గేశ్ చెబుతున్నాడు. రైల్వేస్టేషన్‌లో దుర్గేశ్, అతడి కొడుకు కదలికలను గమనించినవారే ఈ కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. బెగ్గింగ్ మాఫియా చిన్నారిని ఎత్తుకెళ్లి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కోణంలో విచారణ చేపట్టారు.

ANN TOP 10