AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్ తాంత్రిక పూజలు చేస్తున్నారు… బండి సంజయ్

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ విరుచుకుపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తాంత్రిక పూజలు చేస్తున్నారని.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పూజలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలకు కేసీఆర్ నిమ్మకాయలు ఇస్తున్నారని.. ఎమ్మెల్యేలూ జాగ్రత్తగా ఉండండి అంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇతరుల నాశనం కోరుకుంటున్నారన్నారు. డబ్బులతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో కేసీఆర్‌ కోవర్టులు ఉన్నారన్నారు. కాంగ్రెస్‌లో కులాల కొట్లాటను కేసీఆరే పెట్టిస్తున్నారని ఆరోపించారు. అక్కడ ఎవరు గెలిచినా కేసీఆర్ దగ్గరికే వెళ్తారని అన్నారు. కేసీఆర్‌ను యువత క్షమించదని ఎంపీ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10