AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేలకు చేరిన గ్రహశకలం.. నాసా చరిత్రలో మరో ఘనత

విశ్వం సృష్టి పరిణామాలను సంతరించుకుని ఉండే గ్రహశకలంలోని ముక్కను తీసుకుని నాసా క్యాప్సూల్స్ ఆదివారం ఉటా ఎడారిలో దిగింది. అక్కడ ఉటా మిలిటరీ టెస్ట్, ట్రైనింగ్ రేంజ్‌లోకి చేరుకుంది. అత్యంత క్లిష్టతరమైన భూ వాతావరణం నడుమ ఈ క్యాప్సూల్ నిర్ణీత ప్రదేశానికి చేరుకుంది. అస్టారాయిడ్ శకలాల అన్వేషణకు ఈ క్యాప్సూల్‌ను ఏడు సంవత్సరాల క్రితం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కక్షలోకి పంపించింది. ఒసిరిస్ రెక్స్ మిషిన్‌లో భాగంగా పంపిన క్యాప్సుల్ నిర్ణీత ప్రదేశానికి చేరుకోవడం పూర్తి అయిందని నాసా ఈ ఘట్టం ప్రత్యక్ష ప్రసారం దశలో తెలిపారు. వీడియో వెబ్‌కాస్ట్ ద్వారా ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వెలువరించారు.

బిలియన్ మైళ్ల దూరంలోని బెన్నూ అస్టారాయిడ్‌కు ఏళ్ల తరబడి ఈ జర్నీ సాగిందని, ఇది ఇప్పుడు ముగిసిందని వ్యాఖ్యానించారు. బెన్నూ నుంచి శాంపుల్‌ను 2020లో సేకరించారు. ఇందులో దాదాపు 250 గ్రాముల ( తొమ్మిది ఔన్స్) శకలం భాగం ఉంది. అస్టారాయిడ్ ఉపరితలం నుంచి సేకరించిన దుమ్మూ ధూళిని తీసుకున్న క్యాప్సూల్ భూమికి లక్ష కిలోమీటర్ల దూరంలో వాహక నౌక నుంచి విడిపోయి , నాలుగు గంటల వ్యవధిలో భూమికి చేరుకుంది. ఇంతకు ముందు అస్టారాయిడ్స్‌కు సంబంధించి రెండు నమూనాలను జపానీ క్యాప్సుల్స్ తీసుకువచ్చాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10