ప్రగతిభవన్లో ఈ నెల15న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 15న పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన ప్రగతిభవన్లో జరుగనున్నది. ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. పార్టీ రాజ్యసభ, లోక్సభ సభ్యులందరూ హాజరు కావాలని సీఎం కేసీఆర్ కోరారు.
