AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి ఇద్దరు కార్మికుల మృతి

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్ట సొసైటీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం పై నుంచి నలుగురు కార్మికులు ప్రమాదవశాత్తు కింద పడగా.. వారిలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు దగ్గరలో ఉన్న ప్రతిమ హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. భవనంలోని ఆరవ అంతస్తులో పిట్టగోడ నిర్మాణ పనులు కొనసాగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పిట్టగోడతో పాటు సెంట్రింగ్ కర్రలు కూడా విరిగి కార్మికులు కింద పడిపోయారు. మృతి చెందిన కార్మికులు గాయపడ్డ కార్మికుల వివరాలు తెలియాల్సి ఉంది.

ANN TOP 10