AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రముఖ రచయిత, గాయకుడు జయరాజుకు కాళోజీ అవార్డు

ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజును కాళోజీ అవార్డు వరించింది. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం ఏటా.. పద్మ విభూషణ్‌, ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుతో అవార్డు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సుల మేరకు 2023 సంవత్సరానికి గానూ కాళోజీ నారాయణరావు అవార్డుకు జయరాజును సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. ఈ నెల 9వ తేదీన కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమంలో ఈ అవార్డును జయరాజుకు అందించనున్నారు. అవార్డు కింద రూ.1,01,116 నగదుతో పాటు జ్ఞాపికను అందించి జయరాజును సత్కరించనున్నారు.

మహబూబాబాద్ జిల్లాకు చెందిన జయరాజు చిన్నప్పటి నుంచి సాహిత్యం పట్ల మక్కువ చూపించారు. ఎన్నో కష్టాలను అధిగమించి కవిగా పేరు తెచ్చుకున్నారు. పేద దళిత కుటుంబానికి చెందిన జయరాజు వివక్ష లేని సమసమాజం కోసం తనవంతుగా సాహిత్యంతోనూ.. తన గానంతోనూ కృషి చేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో తన సాహిత్యంతో ప్రజలను ఉత్తేజపరిచారు. గ్రామగ్రామాన తిరుగుతూ తన ఆట, పాట ద్వారా జనాల్లో ఉద్యమ భావజాలాన్ని రగిలించి మంచి వాగ్గేయకారునిగా పేరు తెచ్చుకున్నారు జయరాజు.

ANN TOP 10