AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సోనియాగాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఆదివారంనాడు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. స్వల్పంగా జ్వరం రావడంతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాదిలో సోనియా ఇప్పటికే రెండుసార్లు ఇదే ఆసుపత్రిలో చేరారు. వైరల్ శ్వాసకోస ఇన్ఫెక్షన్‌తో ఈ ఏడాది జనవరి 12న ఆసుపత్రిలో చేరారు. ఐదు రోజుల తర్వాత 17న ఆసుప్రతి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఆ తర్వాత మార్చి 2న జ్వరంతో అదే ఆసుపత్రిలో సోనియా చేరారు. ఆ తర్వాత కోలుకున్న ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆగస్టు 31న ముంబైలో నిర్వహించిన ఇండియా కూటమి సమావేశంలో కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు.

ANN TOP 10