మెగా డీఎస్సీ ప్రకటించాలని అభ్యర్ధులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బుధవారం సోషల్మీడియా వేదికగా స్పందించారు. ఇది మెగా డీఎస్సీ కాదు… ఎన్నికల కోసం ప్రకటించిన దగా డీఎస్సీ అని సెటైర్ వేశారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారం 21 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ముఖ్యమంత్రి మాటల ప్రకారం 13 వేల పోస్టుల ఖాళీగా ఉన్నాయని, నోటిఫికేషన్లు ఇచ్చేది మాత్రం 5 వేల పోస్టులకేనా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ పై రూ .200 తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై ఆయన స్పందించారు. ఒక గజదొంగ దారిదోపిడీ చేసి సర్వం దోచుకున్న తర్వాత దారి ఖర్చుల కోసం రూ.200 ఉంచోకోమని ఇచ్చిననట్లుగా కేంద్ర ప్రభుత్వం వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో గ్యాస్ బండ ధర రూ.410 ఉంటే దానిని మోడీ అధికారంలోకి వచ్చాక రూ. 1200 చేశారని దుయ్యబట్టారు. ఇన్నాళ్లు పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బందుల పాలు చేసి తీరా ఇప్పుడు గ్యాస్ ధర తగ్గించడాన్ని ఇలా కాకుండా మరెలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.