చెట్టుకు వేలాడుతూ కనిపించిన ప్రేమ జంట మృతదేహాలు..
నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. ఘటనా స్థలంలో పురుగుల మందు డబ్బా ఉండటంతో ఆత్మహత్య చేసుకుని ఉంటారనే అందరూ అనుకున్నారు. కానీ మృతుల శరీరాలపై గాయాలు ఉండటంతో.. ఎవరైనా హత్య చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతోన్నాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
చందంపేట మండలం కాసరాజుపల్లి సమీపంలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు గుర్తించారు. చెట్టుకు వేలాడుతూ మృతదేహాలు కనిపించడంతో.. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ద్విచక్ర వాహనం, పురుగుల మందు డబ్బా, సూసైడ్ లెటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బైక్పై వచ్చిన ప్రేమ జంట.. పురుగుల మందు తాగి, ఆ తర్వాత తాడుతో చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ప్రేమికుల ఆత్మహత్యపై స్థానికుల అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శరీరంపై గాయాలు ఉండటంతో.. హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రేమికులకు సంబంధించిన వ్యక్తులే కొట్టి, ఆ తర్వాత చెట్టుకు ఉరేసి ఉంటారని స్థానికులు అనుమానపడుతున్నారు. మృతులను రాకేష్, వరికుప్పల దేవిగా పోలీసులు గుర్తించారు. రాకేష్ది ఎస్సీ సామాజికవర్గం కాగా.. దేవి బీసీ కులానికి చెందిగా అమ్మాయిగా గుర్తించారు. ఈ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.
ఇరు కుటుంబాలకు చెందివారిని ప్రశ్నిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? లేదా ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు కారణలేంటి? అనే వివరాలు తెలియాల్సి ఉంది.