తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. కాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు 10మంది అధికారులపై కేసులు నమోదు చేయాలంటూ తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ తీర్పునిచ్చారు. ఈ తీర్పుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన సుప్రీంకోర్టు ఏకంగా జడ్జిపైనే సస్పెన్షన్ వేటు వేసింది. రాజ్యంగబద్ద వ్యవస్థలపై కేసులు పెట్టాలని ఎలా ఆదేశిస్తారు? అంటూ ప్రశ్నిస్తూ అసహనం వ్యక్తిచేస్తూ సస్పెన్షన్ ను విధించింది. రాజ్యాంగ వ్యవస్థలపై కేసులు నమోదుకు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది. అనంతరం జడ్జి జయకుమార్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
