ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి కేబినెట్లో బెర్త్ కన్ఫార్మ్ అయ్యింది. అయితే.. గురువారం (నేడు) మూడు గంటల సమయంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు అధికార పార్టీ నేతలు వెల్లడించారు. అయితే.. ఈటల రాజేందర్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగానే ఉంటోంది. అయితే.. ఈటల చూసుకున్న వైద్యారోగ్య శాఖను మాత్రం ఇన్ని రోజులూ.. హరీశ్ రావు చూసుకుంటూ వస్తున్నారు. కాగా.. ఈటల ప్లేస్ను మాత్రం ఇప్పుడు బర్తీ చేస్తున్నారు. మొన్నటి నుంచే.. మంత్రివర్గ విస్తరణ చేయనున్నారని.. అందులో ఇద్దరు బీఆర్ఎస్ నేతలకు ఛాన్స్ ఉందని వార్తలు వస్తుండగా.. అందులో మహేందర్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపించింది.
అయితే.. ఇంతకు ముందు కూడా మహేందర్ రెడ్డికి మంత్రిగా పని చేసిన అనుభవం ఉండగా.. ఇప్పుడు కూడా ఆయనకే పదవి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ను పట్నం మహేందర్ రెడ్డి కలిశారు. అయితే.. మంత్రి పదవి మొన్ననే కన్ఫార్మ్ చేసినా.. గవర్నర్ తమిళిసై అందుబాటులో లేకపోవటంతో ఆ విషయాన్ని బయటకు చెప్పలేదని సమాచారం. కాగా.. గవర్నర్ సమయం ఇవ్వటంతో.. రేపు మూడు గంటలకు మంత్రిగా పట్నం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.