AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విజయవంతంగా జాబిల్లిపై దిగిన చంద్రయాన్ 3

చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పంపించిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. విక్రమ్ ల్యాండర్ అత్యంత ఖచ్చితత్వంతో జాబిల్లిపై అడుగు పెట్టింది. ఇక చందమామ రావే.. జాబిల్లి రావే అని పాటలు పాడకుండా మనమే చందమామను అందుకున్నాం. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాని విధంగా చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగు పెట్టి.. అగ్రరాజ్యాలు సుసాధ్యం అని భావించిన దాన్ని భారత్ సాధ్యం చేసి.. జయహో భారత్ అనేలా చేసింది. చంద్రుడిపై దిగిన ల్యాండర్.. జాబిల్లి నిర్మాణం, అక్కడి వాతావరణం, పరిమాణంపై చంద్రయాన్‌ 3 పరిశోధించనుంది.

15 ఏళ్ల క్రితం చంద్రుడిపై నీరుందని మొదటి జాబిల్లి యాత్ర చంద్రయాన్ 1 తోనే గుర్తించిన భారత్.. చంద్రయాన్ 3 ప్రయోగంతో జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా నిలిచింది. చంద్రయాన్‌ 3 తో జాబిల్లిపై ఎవరూ వెళ్లని దారుల్లో వెళ్లి.. ఎవరూ చూడని దక్షిణ ధ్రువాన్ని ప్రపంచానికి చూపించింది. బుధవారం సాయంత్రం 6.03 గంటలకు విక్రమ్ ల్యాండర్‌ జాబిల్లిపై దిగ్విజయంగా కాలుమోపి.. భారత వైజ్ఞానిక సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది.

బుధవారం సాయంత్రం 5.44 గంటలకు విక్రమ్ ల్యాండర్‌.. నిర్దేశించిన ప్రాంతానికి చేరుకుంది. ఆ సమయంలోనే ల్యాండింగ్‌ మాడ్యూల్‌కు ఆటోమేటిక్‌ ల్యాండింగ్‌ సీక్వెన్స్‌ కమాండ్‌ను ఇస్రో పంపించింది. ఈ కమాండ్‌ను అందుకున్న ల్యాండర్‌.. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనస్ సాయంతో సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రారంభించింది. తన 4 థ్రాటల్‌బుల్‌ ఇంజిన్లను ప్రజ్వలించి క్రమంగా వేగాన్ని తగ్గించుకుంది. రఫ్‌ బ్రేకింగ్‌ దశను సక్సెస్‌ఫుల్‌గా ముగించుకుని చంద్రుడి ఉపరితలం నుంచి 7.4 కిలోమీటర్ల ఎత్తుకు చేరింది.

అనంతరం దిశను మార్చుకున్న ల్యాండర్‌.. ల్యాండర్‌ పొజిషన్‌ డిటెక్షన్‌ కెమెరా, కేఏ బ్యాండ్‌ అండ్‌ లేజర్‌ బేస్డ్‌ అల్టీమీటర్లు, లేజర్‌ డాప్లర్‌ వెలోసీమీటర్‌ వంటి పరికరాలతో తన మార్గాన్ని నిర్దేశించుకుంది. ఆ తర్వాత దశల వారీగా నెమ్మదిగా జాబిల్లి ఉపరితలానికి కొన్ని మీటర్ల ఎత్తులోకి చేరింది. చివరిగా ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని సక్సెస్‌ఫుల్‌గా చంద్రుడిపై అడుగు పెట్టింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10