జాబిల్లి వైపు వడివడిగా.. ఒక్కో దశను దాటుకుంటూ సాగుతోంది చంద్రయాన్–3. ఈ క్రమంలో ఈ రోజు కీలక ముందడుగు పడింది. అంతరిక్ష నౌక నుంచి ల్యాండర్ ‘విక్రమ్’ విడిపోయింది. ఈ రోజు నుంచి ల్యాండర్.. చంద్రుడి చుట్టూ తిరగనుంది. ఈనెల 23న చంద్రుడి దక్షిణ ధృవం ఉపరితలంపై ల్యాండ్ కానుంది. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విడిపోయిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఇస్రో వెల్లడించింది.
‘‘ఎల్ఎం (ల్యాండర్ మాడ్యూల్) విజయవంతంగా ప్రొపల్షన్ మాడ్యూల్ (పీఎం) నుంచి వేరుపడింది. రేపు నిర్వహించే డీబూస్టింగ్ తర్వాత.. ల్యాండర్ మాడ్యూల్ను మెల్లగా తక్కువ కక్ష్యలోకి వెళ్తుంది” అని ఇస్రో తెలిపింది.