AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఖమ్మం జిల్లా ప్రధాన పాత్ర పోషించలేదు.. అజయ్

ఖమ్మం జిల్లా ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి
తెలంగాణ అభివృద్ధిలో ఖమ్మం జిల్లా ప్రధాన పాత్ర పోషించలేదని పువ్వాడ అజయ్ సంచలనానికి తెరదీశారు. రెండు సార్లు బీఆర్ఎస్‌ను జిల్లాలో ఒక్క స్థానంలో మాత్రమే గెలిపించారన్నారు. ఈ సారైనా ఖమ్మం జిల్లా ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని హితవు పలికారు. అభివృద్ధి చేసిన కేసిఆర్ కు అండగా నిలవాలన్నారు. పోడు భూములకు పట్టాల పంపిణీలో అధిక ప్రాధాన్యం ఖమ్మం జిల్లాకు దక్కిందన్నారు. ఖమ్మం జిల్లా లేకుండానే బీఆర్ఎస్ 85స్థానాల్లో గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి ఎమ్మేల్యే కావడం వల్ల భద్రాచలాన్ని అభివృద్ది చేయలేదన్నారు. పార్టీకి ద్రోహం చేసే వారు మూల్యం చెల్లించక తప్పదన్నారు. కొందరు స్థాయి మరచి కేసిఆర్, కేటీఆర్, హరీష్ రావు మీద విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఒక్క రోజు జై తెలంగాణ అనని వ్యక్తి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని పువ్వాడ అజయ్ విమర్శించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10