AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇళ్లుపీకి పందిరి వేయడమేనా?

భూములు అమ్మడం చూస్తుంటే అలానే ఉంది
80వేల పుస్తకాలు దేనికి చదివినట్లు ..
సీఎం కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి ఫైర్‌

సీఎం కేసీఆర్‌ భూముల అమ్మడం చూస్తుంటే ఇళ్లు కూల్చి పందిరి వేసినట్లుగా ఉందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ధనిక రాష్ట్రం అని పదేపదే బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతుంటారని, భూములు ఎందుకు అమ్ముతున్నారని, అమ్మకం అంటే ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మారుస్తున్నారని, ప్రభుత్వ సొమ్మును అంగట్లో అమ్మడం అనేది దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. సంపద సృటించాలి కానీ.. అమ్ముకుంటే పోతే వ్యవస్థలు కుప్ప కులుతాయన్నారు. భూములు అమ్ముకుంటే పోతే వ్యస్థ పతనానికి నాంది అని, సీఎం కేసీఆర్‌ 80 వేల పుస్తకాలు చదివింది దీనికోసమేనా..? అని ప్రశ్నించారు.

భవిష్యత్తుకు, భావితరాలకు ఉపయోగోపడాల్సిన భూములను అమ్మడం సరైన నిర్ణయం కాదని కిషన్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి కార్యాలయానికి 10 ఎకరాలు భూమిని ఇచ్చిందని, ప్రజలకు ఉపయోగ పడే సైన్స్‌ సిటీకి మాత్రం భూమి ఇవ్వమంటే ఇవ్వరని మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు కుమ్మక్కయి అక్రమంగా భూములు పంచుకుంటున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు 11 ఎకరాలు, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు 10 ఎకరాలు ఇచ్చారని, రెండు పార్టీలు కుమ్మక్కయి కలసి పని చేస్తున్నాయని విమర్శించారు.

ANN TOP 10