హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో గుడ్న్యూస్. ఇటీవల కాలం నుంచి మెట్రో ప్రయాణికుల కోసం సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తోంది. భాగ్యనగరంలో ట్రాఫిక్ దృష్ట్యా చాలా మంది మెట్రో రైలును ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రయాణం సులభతరం అవుతుండటంతో ప్రయాణికులను మరింతగా ఆకట్టుకునేందుకు హైదరాబాద్ మెట్రో సరికొత్త ప్లాన్ ప్రకటించింది. భారతదేశపు 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు ‘సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్’ ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్ కల్పిస్తోంది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వారంతంలో ప్రయాణికుల అనుభూతిని మరింతగా పెంచేందుకు ఈ ఆఫర్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ఆఫర్ లో భాగంగా కేవలం రూ. 59 తో తమ సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్ను రీఛార్జ్ చేయడం ద్వారా ఆగస్ట్ 12, 13, 15వ తేదీల్లో అపరిమిత మెట్రో రైడ్లను ఆస్వాదించవచ్చని మెట్రో రైల్ సుదీర్ఘ స్వాతంత్య్ర దినోత్సవ వారాంతంలో మెట్రో ప్రయాణాన్ని ఎంచుకోవడానికి ఎక్కువ మందిని ప్రోత్సహించడానికి ఈ స్వాతంత్య్ర దినోత్సవ ప్రత్యేక ప్రమోషన్ ప్రయత్నిస్తుంది. అయితే ప్రయాణికులకు ప్రత్యేకమైన ప్రయోజనాలను అందించడం కంటే మిన్నగా ఈ ఆఫర్ విస్తరించింది.