ఐటీ సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల కోసం ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం లేడీస్ స్పెషల్ బస్సులను ప్రవేశపెట్టింది. సోమవారం రోజున జేఎన్టీయూ నుంచి వేవ్రాక్ వరకు లేడిస్ స్పెషల్ బస్సులను ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. దశలవారిగా .. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులు ప్రవేశపెడతామని సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ ఖాన్ వెల్లడించారు.
అయితే ఈ బస్సు ఉదయం 9.00 AM గంటలకు జేఎన్టీయు నుంచి వేవ్రాక్కు స్టార్ట్ అవుతుంది. డ్యూటీలు ముగిసిన తర్వాత మళ్లీ సాయంత్రం 5.00 PM గంటలకు వేవ్రాక్ నుంచి జేఎన్టీయూ వరకు స్పెషల్ బస్సులు నడుస్తాయి. అయితే కేవలం ఐటీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులే కాకుండా హౌస్కీపింగ్ వంటి సర్వీస్ రంగంలో పనిచేస్తున్న మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో ప్రయాణాలు చేస్తున్నారు. ముఖ్యంగా జీడిమెట్ల, మియాపూర్, కూకట్పల్లి తదితర్ ప్రాంతాలనుంచి పెద్ద ఎత్తున రాకపోకలు జరుగుతున్నాయి.