AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆదిలాబాద్‌ జిల్లాలో నాలుగు పులుల సంచారం

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం గోళ్లగడ్‌ తాంసీ సమీపంలో నాలుగు పెద్ద పులుల సంచరిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. డీజిల్‌ కోసం వెళ్లిన డ్రైవర్‌ కు నిన్న రాత్రి పిప్పల్‌ కోటి రిజర్వాయర్‌ దగ్గర నాలుగు పులులు కనిపించాయి. కొరాట, గూడా, రాంపూర్, తాంసీ, గొల్లఘాట్‌ ప్రాంతాల్లోని రైతులు ఇప్పటికే పులుల భయంతో పంట పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. వారం క్రితం చెనాక కొరటా పంప్‌ హౌస్‌ సమీపంలో 2 పులులు కనిపించాయి. మళ్లీ ఇప్పుడు మరో నాలుగు పులులు సంచరిస్తుండటంతో.. వాటిని పట్టుకోవాలని స్థానికులు అటవీశాఖ అధికారులను కోరుతున్నారు. అటవీ శాఖ అధికారులు పులుల కోసం బేస్‌ క్యాంపులు ఏర్పాటు చేశారు.

ANN TOP 10