AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కుక్కల వెంట అధికారులు పరుగులు

నగరంలో ఆపరేషన్‌ డాగ్స్‌
ఇప్పటి వరకు 500 కుక్కల పట్టివేత

హైదరాబాద్‌: కుక్కల వెంట అధికారులు, సిబ్బంది పరుగులు పెడుతున్నారు. వీధుల్లో కుక్కల బెడద ఎక్కవ కావడం.. దాడలు చేస్తుండటంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ రోజు తెల్లవారుజామునుంచి ఆపరేషన్‌ డాగ్స్‌ చేపట్టారు. వీధి కుక్కల వెంటపడి పట్టుకుంటున్నారు. ఇప్పటివరకూ 500 కుక్కల్ని పట్టుకున్నారు. కుక్కల కోసం అన్నీ వీధులు, కాలనీల్లో తిరుగుతున్నారు. వారిని చూసి వీధి కుక్కలు పారిపోతున్నాయి. అటు పాతబస్తీలో కూడా స్పెషల్‌ ఆపరేషన్‌ చేపట్టి… కుక్కల్ని అధికారులు పట్టుకునేలా చేస్తోంది.

అటు మనుషులపై కుక్కల దాడులు కొనసాగుతున్నాయి. నిన్న హైదరాబాద్‌ .. అంబర్‌ పేటలో వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన మరవక ముందే… మరో నాలుగు ఘటనలు ఇవాళ వెలుగుచూశాయి. చైతన్యపురిలోని మారుతీ నగర్‌లో ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల పిల్లాడు రిషిపై వీధి కుక్కలు దాడి చేశాయి. పిల్లాడు కేకలు వెయ్యడంతో.. ఆ అరుపులు విన్న కుటుంబ సభ్యులు ఇంట్లోంచీ వచ్చి… పిల్లాణ్ని కాపాడారు. అప్పటికే ఆ కుక్కలు.. పిల్లాడి వీపు, కాలిని కరిచేశాయి.

అటు కరీంనగర్‌లోని శంకరపట్నం ఎస్సీ హాస్టల్‌ లోకి వెళ్లి మరీ కుక్కలు సుమంత్‌ అనే విద్యార్థిపై దాడి చేశాయి. అప్రమత్తమైన మిగతా వారు అతన్ని కాపాడారు. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఇలాంటి మరో రెండు ఘటనలు కూడా జరిగినట్లు తెలిసింది.

ANN TOP 10