AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మ‌ద‌న‌ప‌ల్లిలో టమాటా రైతు దారుణ హ‌త్య‌…

ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టమాటా రైతు దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలలోకి వెళితే, మృతుడు బోడి మల్లెదిన్నెకు చెందిన నారెం రాజశేఖర్‌ రెడ్డి ఆయన నిన్న మార్కెట్‌ కు 71 క్రేట్ల టమాటాను తీసుకువచ్చి విక్రయించాడు. రైతు టమాటాలు అమ్మి వచ్చిన డబ్బులు దోచుకోవడానికి వచ్చిన దుండగులు అతడిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మొదట ఒకసారి వచ్చి రాజశేఖర్‌ రెడ్డి ఇంట్లో ఉన్నాడా? అని ఆరా తీశారు దుండగులు. ఆ తరువాత కాసేపటికే అతను మృతి చెందాడు. రాజశేఖర్‌ రెడ్డి మెడకు టవల్‌ తో ఉరి బిగించి హత్య చేశారు దుండగులు. టమాటాల కోసం వచ్చిన వారే హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులకోసం గాలిస్తున్నారు.

ANN TOP 10