కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతో మనస్తాపానికి చెంది మైనర్ ఓ మైనర్ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. చున్నీకి ఇద్దరూ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చాపేటలో చోటు చేసుకుంది. ఉరి వేసుకుని మైనర్ ప్రేమజంట ఆత్మహత్య పాల్పడ్డారు. ఈ జంట నేడు ఉదయం బలవన్మరణానికి పాల్పడింది. దుబ్బాకకు చెందిన మైనర్ బాలిక (ఇంటర్ మొదటి సంవత్సరం), లచ్చాపేటలో పదో వార్డుకు చెందిన మైనర్ బాలుడు (ఇంటర్ ద్వితీయ సంవత్సరం) దుబ్బాకలోని ఓ ప్రయివేటు కళాశాలలో చదువుతున్నారు.
కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం మైనర్ బాలుడి కుటుంబానికి చెందిన ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. ఒకే తాడుతో ఇద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుర్తించిన బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దుబ్బాక ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలంలో ఓ లేఖ లభ్యమైనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.









