AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్ఎస్ బీజేపీకి ముమ్మాటికీ బీ టీమే.. అందుకే రాద్దాంతం

హైదరాబాద్: రైతులకు ఉచిత విద్యుత్ గురించి తానా సభలో మాట్లాడిన మాటలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన వేళ తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా ట్విటర్ వేదికగా స్పందించారు.

“బీఆర్ఎస్ బీజేపీకి ‘బి’ టీం అని మరోసారి నిరూపితమైంది. రేపు రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా “సత్యాగ్రహ దీక్ష” పిలుపుని నీరుగార్చాలని, ఉచిత విద్యుత్‌పైకి దృష్టి మరల్చాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తుంది. 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదన్న విషయం ఏ సబ్ స్టేషన్‌కు వెళ్లినా తెలుస్తుంది.

తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీతికి బలిపెట్టిన ఘనుడు కేసీఆర్. ఈ మోసాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలకేంద్రాలలో సబ్ స్టేషన్ల ముందు కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిస్తున్నాం” అని రేవంత్ రెడ్డి అన్నారు.

ANN TOP 10