రూ. కోటితో ప్రభుత్వ బడికి చేయూత
సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు రావు తన గొప్ప మనసు చాటుకున్నారు.. చిన్న వయసులోనే తాను చేసే పనులతో తాతకు తగ్గ మనవడు, తండ్రి తగ్గ తనయుడు అన్న కితాబు పొందుతున్నారు. కాగా.. ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకున్న హిమాన్షు.. సుమారు కోటి రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూల్లా తీర్చిదిద్దారు. సీఏఎస్ అధ్యక్షుడిగా తన స్కూల్లో కలెక్ట్ చేసిన ఫండ్తో ఈ బృహత్ కార్యాన్ని పూర్తి చేశారు. అయితే.. హిమాన్షు పుట్టినరోజు పురస్కరించుకుని ఈ నెల 12న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా స్కూల్ ప్రారంభించనున్నారు.









