AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీలో మరింత ముదిరిన వార్..

బండి సంజయ్ టార్గెట్‌గా పోస్ట్‌ల కలకలం
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తొలగిస్తారనే ప్రచారం కొద్దిరోజులుగా మరింత ఊపందుకుంది. ఇటీవల ఈటలకు ఢిల్లీ బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఆయన వెళ్లి నడ్డా, అమిత్ షాను కలవడం, ఈ తర్వాత వెంటనే బండి సంజయ్ హస్తిన పర్యటనకు వెళ్లడంతో ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా పార్టీలో కొన్ని గ్రూపులు ఏర్పడటంతో.. ఆయన స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు మరోసారి అప్పగిస్తారనే ప్రచారం బాగా నడుస్తోంది.

ఈ క్రమంలో బండి సంజయ్ టార్గెట్‌గా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి సోషల్ మీడియాలో కాషాయ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయారు. కొంతమంది బండి నాయకత్వానికి మద్దతిస్తూ పోస్ట్‌లు పెడుతుండగా.. మరికొంతమంది ఆయనను వ్యతిరేకిస్తూ పోస్ట్‌ల పరంపర కొనసాగిస్తున్నారు. టీ బీజేపీ కార్యకర్తలు రెండుగా చిలిపోయి ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌లలో పోటాపోటీగా పోస్ట్‌లు పెడుతున్నారు. బండి సంజయ్‌ను మారిస్తే తమ పదవులకు రాజీనామా చేస్తామని కొంతమంది సెకండ్ స్థాయి నేతలు, కార్పొరేటర్లు హెచ్చరిస్తున్నారు. మరో వర్గం మాత్రం బండి సంజయ్‌ను మారిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

సోషల్ మీడియా వేదికగా బీజేపీ శ్రేణుల మధ్య జరుగుతున్న వార్ ఆ పార్టీలో కలకలం సృష్టించింది. కార్యకర్తలు స్వచ్చంధంగానే పోస్ట్‌లు పెడుతున్నారా..? లేదా దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే అనుమానాలు కూడా కాషాయదళంలో వ్యక్తమవుతున్నాయి. పార్టీలోని కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారనే చర్చ జరుగుతోంది. మొన్నటివరకు టీ కాంగ్రెస్‌లో నేతల మధ్య వర్గపోరు నడిచేది. నేతలు బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేవారు. కానీ ఇటీవల కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తీరు ఒక్కసారిగా మారింది.

ANN TOP 10