రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఔదార్యం ఓ దివ్యాంగుడిలో మనోధైర్యాన్ని నింపింది. నగరంలోని ఫిల్మ్నగర్లో ఉండే ఓ దివ్యాంగుడికి మంత్రి కేటీఆర్ స్పందించి గిఫ్ట్-ఎ-స్మైల్2 పేరుతో బండి (వాహనం) అందజేశారు. రామన్న ఇచ్చిన బండి ఎంతో మేలు చేస్తున్నదని.. మంత్రి సారుకు జీవితాంతం రుణపడి ఉంటానని దివ్యాంగుడు అన్నారు. ఈ మేరకు స్థానిక బీఆర్ఎస్ నాయకులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గిఫ్ట్-ఎ-స్మైల్2తో అభాగ్యుల మోములో చిరునవ్వులు పూయిస్తున్న మన రామన్న నిజంగా తెలంగాణకే గర్వకారణమని నాయకులు మంత్రి సేవలను కొనియాడారు.
