AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మెడికల్‌ కాలేజీలు టార్గెట్‌గా ఈడీ సోదాలు.. 15 చోట్ల తనిఖీలు..

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. ఇటీవల పలువురు బీఆర్ఎస్ నేతల ఇళ్లు, ఆఫీసులపై ఈడీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. పలువురిని విచారణకు ఆదేశిస్తూ నోటీసులు కూడా జారీ చేసింది. ఇక ఇప్పుడు మెడికల్‌ కాలేజీలు టార్గెట్‌గా ఈడీ సోదాలు చేపట్టింది. తెలంగాణలో మొత్తంగా 15 చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. SVS, కామినేని సహా పలు మెడికల్‌ కాలేజీల్లో తనిఖీలు చేపట్టింది ఈడీ. కామినేని హాస్పిటల్స్‌ గ్రూప్‌పై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.

కామినేని గ్రూప్ చైర్మన్,ఎండీ నివాసాలపై సోదాలు జరుగుతున్నాయి. శశిధర్‌ కామినేని, వసుంధర కామినేని, కామినేని సూర్యనారాయణ, గాయత్రిదేవి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. కింగ్‌కోఠిలోని కామినేని ప్రధాన కార్యాలయంలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం నుంచి ఈడీ అధికారులు 11 బృందాలుగా బయలుదేరారు. భారీ సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు ఈడీ బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌తో పాటు నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మేడ్చల్, ఖమ్మం జిల్లాల్లో ఈడీ దాడులు చేసే అవకాశం ఉంది.

ANN TOP 10