AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజేంద్ర నగర్ లో జంట హత్యల కలకలం

హైదరాబాద్: హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో జంట హత్యలు చోటు చేసుకున్నాయి. పుట్ పాత్ పై నిద్రిస్తున్న ఇద్దరిని గుర్తు తెలియని దుండగులు బండరాయితో కొట్టి అతి దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ANN TOP 10