AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పదేళ్లలో వేగంగా కరిగిపోతున్న హిమానీనదాలు..

భారత్ సహా 16 దేశాలకు పెను ముప్పు
దేశంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేడి గాలులతో (Heat Waves) జనం అల్లాడిపోతున్నారు. అనూహ్య వాతావరణ మార్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతూ పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ తరుణంలో హిమాలయ (Himalayas) ప్రాంతంలోని హిమనీ నదాలు (Glaciers) వేగంగా కరిగిపోతున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. దీని కారణంగా తక్కువలో తక్కువగా రెండు బిలియన్ల మంది జీవితాలకు, జీవనోపాధికి ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతాలకు నిలయమైన ఆసియా హిందూ కుష్ (Hindu Kush) హిమానీనదాలు 2011 నుంచి 2020 మధ్య కాలంలో మునుపటి దశాబ్దంతో పోలిస్తే 65% వేగంగా కరిగినట్టు అధ్యయనం పేర్కొంది.

ఇది ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం చివరి నాటికి వాటి ప్రస్తుత పరిమాణంలో 80 శాతం కోల్పోవచ్చని నేపాల్‌కు చెందిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్‌మెంట్ (ICIMOD) తాజా అధ్యయనం తెలిపింది. దీని ఫలితంగా కాలక్రమేణా ఈ ప్రాంతంలోని 16 దేశాలలో ప్రవహించే 12 నదులలో మంచినీటి సరఫరాను భారీగా తగ్గిపోవచ్చని వివరించింది.

పశ్చిమాన అఫ్గనిస్థాన్ నుంచి తూర్పు మాయన్మార్ వరకూ 3,500 కిలోమీటర్ల (2,175) పొడవునా విస్తరించి ఉన్న ఈ పర్వత శ్రేణుల్లో మరింత క్షీణిస్తోన్న మంచు కారణంగా భారీగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ఐసీఐఎంఓడీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అధ్యయనంలో చైనా, భారత్ సహా ఆసియాలోని 8 దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

‘ఈ క్లిష్టమైన ప్రాంతాన్ని రక్షించడానికి ఇంకా సమయం ఉంది..కానీ, వేగవంతమైన, లోతైన ఉద్గారాల కోతలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి’ అని ఐసీఐఎండీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇసాబెల్లా కొజైల్లా అన్నారు. హిమానీనదాలు స్వల్ప ఉష్ణోగ్రతల పెరుగుదలకు కూడా కరిగిపోయేంత చాలా సున్నితంగా ఉంటాయని ఆయన అన్నారు. ‘మంచు, హిమానీనదాలు కరుగుదల శాశ్వత మంచు ద్రవీభవనం అంటే విపత్తులు తరచుగా జరుగుతాయని అంచనా.. దీని వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది’ అని పేర్కొన్నారు.

ANN TOP 10