AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కెసిఆర్ హరితహారం దేశానికే ఆదర్శం

హరితోత్సవం అద్భుతం
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో..
ఖైరతాబాద్ బిఆర్ఎస్ ఇన్ ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి

ఖైరతాబాద్​: సీఎం కేసీఆర్​ మానస పుత్రిక హరితహారం పథకం.. తెలంగాణకు హరిత శోభ తెచ్చిందని బీఆర్​ఎస్​ ఖైరతాబాద్​ నియోజకవర్గ ఇన్​చార్జి మన్నె గోవర్దన్​ రెడ్డి అన్నారు. హరితహారం పథకాన్ని భారత పార్లమెంట్​ మెచ్చుకున్నదని, ఫారెస్ట్​ సర్వే ఆఫ్​ ఇండియా, నీతి ఆయోగ్​ లాంటి సంస్థలు ప్రత్యేకంగా గుర్తించాయని ఆయన అన్నారు.

సోమవారం దశాబ్ది ఉత్సవాల ‘హరితోత్సవం’ కార్యక్రమంలో భాగంగా.. బసవతారకం క్యాన్సర్​ హాస్పిటల్​ ఆవరణలో వెంకటేశ్వరకాలనీ డివిజన్​ కార్పొరేటర్​ మన్నె కవితా రెడ్డి, హాస్పిటల్​ సీఈవో ప్రభాకర్​ లతో కలిసి ఆయన మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్​ఎస్​ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ANN TOP 10