AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్ రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు

గాంధీభవన్ లో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో భారీ చేరికలు జరిగాయి. అచ్చంపేట, షాద్‌నగర్‌ నియోజకవర్గం నాయకులు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గంగాపురం రాజేందర్, భీముడు నాయక్ కాంగ్రెస్ లో తీర్థం పుచ్చుకున్నారు. నేతలకు కండువా కప్పిన రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నెలాఖరున ఖమ్మం సభలో పొంగులేటి, నాగర్ కర్నూల్ సభలో జూపల్లి, దామోదర్ రెడ్డిలు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ నెల 22 తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీతో పొంగులేటి, జూపల్లి, కూచకుళ్ల దమోదర్ రెడ్డి సమావేశం కానున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ దూసుకుపోతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10