AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఖమ్మం పత్తి మార్కెట్లో అగ్నిప్రమాదం

ఖమ్మం పత్రి మార్కెట్ లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పత్తి బస్తాలకు కూడా మంటలు అంటుకున్నాయి. దీంతో మార్కెట్ లో ఉన్న ప్రజలు బయటకు పరుగులు పెట్టారు. దట్టంగా పొగ కమ్మేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు శ్రమిస్తున్నారు. ఈ ఘటన ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

ANN TOP 10