సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రతతో కలిసి స్పెయిన్ వెకేషన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా హిట్గా నిలిచింది. ఇక ఆయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్తో చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ను జరుపుకుంటోంది. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో స్పెయిన్ వెకేషన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఏయిర్ పోర్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.