అసలే ఫైనల్ మ్యాచ్.. అందులోనూ బెట్టింగ్ రాయుళ్లకు పండుగే. లక్షలు వెలల్లోనే బెట్టింగ్ సాగుతుంది. కాయ్ రాజా..కాయ్ అన్నట్టు బాల్ బాల్కు ఒక రేటు కట్టేందుకు బెట్టింగ్ ముఠా రెడీ అయింది. అది కూడా హైదరాబాద్, దాని శివారులోని ప్రత్యేక క్యాంప్లు ఏర్పాటు చేసి బెట్టింగ్ కాస్తున్నారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్పై జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడి పోతారు? గెలిస్తే ఎంత? ఓడి పోతే ఎంత? రేట్లు కట్టి బెట్టింగ్లో డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఐపీఎల్ బెట్టింగ్లకు ముఖ్యంగా హైదరాబాద్ శివారులోని ఫామ్హౌస్లు అడ్డాగా మారాయి. దీంతో హైదరాబాద్ శివారులో ఉన్న ఫాంహౌస్లపై పోలీసుల ప్రత్యేక నిఘా పెట్టారు. ఇప్పటికే పలు బెట్టింగ్ ముఠాలను పట్టుకున్న పోలీసులు.. కీలక సమాచారాన్ని కూడా రాబట్టారు. సాయంత్రం జరిగే ఫైనల్ మ్యాచ్లో ఈ బెట్టింగ్లు పీక్ స్టేజీకి వెళ్లే ఛాన్స్ ఉంది. అటు.. దేశంలోనే అతి పద్ద స్టేడియంగా ప్రసిద్దికి ఎక్కిన నరేంద్ర మోదీ స్టేడియంలో మరి కాసేపట్లో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. గుజరాత్ టైటాన్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈ ఫైనల్ పోరు సాగుతుంది. ఐపీఎల్ కప్ విన్నర్ ఎవరో తేల్చే మ్యాచ్ కావడంతో ఫ్యాన్స్లో ఉత్కంఠ నెలకొంది.