ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు గురించి చర్చించడానికే కేసీఆర్తో కేజ్రీవాల్ భేటీ అయ్యారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) వ్యాఖ్యానించారు. పొన్నాల మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రజల దృష్టి మరలించేందుకే ఇక్కడ కేసీఆర్(KCR).. అక్కడ మోదీ (MODI) జిమ్మిక్కులు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంపై మోదీకి విశ్వాసం ఉందా? బీజేపీ పాలన మాకొద్దంటూ జనం చేతులెత్తి దండం పెడుతున్నారు.
దేశంలో ఆర్డినెన్స్ల ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీజేపీ ప్రభుత్వమే. పార్లమెంట్ భవనం ఏదైనా బీజేపీ అప్రజాస్వామిక పాలనలో ఎలాంటి మార్పు ఉండదు. నల్లధనం తెస్తామన్నారు.. ఏమైంది?. పార్లమెంట్లో నల్లధనం గురించి చర్చించే దమ్ము బీజేపీకి ఉందా? ఉద్యోగాల గురించి డిబేట్ చేసే ధైర్యం మోదీకి ఉందా? అదాని కంపెనీలలో పెట్టుబడుల గురించి మాట్లాడమంటే మోదీ ఎందుకు భయపడుతున్నారు? పార్లమెంట్పై నమ్మకం లేని మోదీ లాంటి వ్యక్తికి పార్లమెంట్ కొత్త భవనం అయితే ఏంటి? పాత భవనం అయితే ఏంటి?.’’ అని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు.