న్యూఢిల్లీ: భారత తొలి ప్రధాని పండిత్ నెహ్రూ 59వ వర్ధంతి సందర్భంగా నేడు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ నాయకుడు, నెహ్రూ ముని మనుమడు రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. శాంతి వన్ స్మారకం వద్ద ఖర్గే, రాహుల్ గాంధీ, పార్టీ కోశాధికారి పవన్ బన్సల్, ఇతర పార్టీ నాయకులు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ‘వారసత్వం ఓ దీపస్థంభంలా నిలువుగా నిలబడి ఉంది, భారత భావన, దాని విలువలను ప్రకాశింపజేస్తోంది.అందుకు ఆయన(నెహ్రూ) జీవితాన్ని అంకితం చేశారు’ అన్నారు.
