AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రమాదవశాత్తు నిప్పంటుకొని 10 ఎకరాల వరి దగ్ధం

ప్రమాదవశాత్తు నిప్పంటుకొని 10 ఎకరాల వరి కాలిపోయింది. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మల్హర్‌‌‌‌‌‌‌‌ మండలం ఎడ్లపల్లిలో శుక్రవారం జరిగింది. ఎడ్లపల్లి చెరువు కట్ట శివారులో రంగు సంపత్‌‌‌‌‌‌‌‌, మంతిని సారయ్య, తోట రమేశ్‌‌‌‌‌‌‌‌ 2 ఎకరాల చొప్పున, తోకలు రాములు, కామ వెంకటేశం ఎకరం చొప్పున వరి సాగు చేస్తున్నారు.

ఈ రైతుల పొలంతో పాటు, పక్కనే ఉన్న కాటారం మండలం దేవరాంపల్లికి చెందిన మరికొందరు రైతుల వరికి నిప్పంటుకుంది. గమనించిన రైతులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చేతికొచ్చిన పంటను కోల్పోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10