ఆలయ పుష్కరణిలో ఈవో స్విమ్మింగ్
నిజామాబాద్ నీలకంఠేశ్వరాలయంలో అపచారం జరిగింది. పుష్కరిణిలో దేవుళ్ల విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా ఈవో వేణు జలకాలాడారు. అభిషేకం జరుగుతుండగా దర్జాగా ఈవో ఈత కొట్టారు. దక్షిణ కాశీగా నీల కంటేశ్వర ఆలయం ప్రసిద్ధి ఉంది.. అలాంటి పుష్కరణిలో, అది కూడా దేవుని విగ్రహాలకు అభిషేకం నిర్వహిస్తుండగా ఇలా చేయడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. పుష్కరిణిలో ఈత కొట్టద్దు అంటూ అర్చకులు వారిస్తున్నా ఈవో వేణు ఈత కొట్టినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియాలో ఈవో వేణు వీడియో వైరల్ కావడంతో.. ఈ వ్యవహారం బయటపడింది. వేణు మొత్తం నాలుగు ఆలయాలకు ఇంఛార్జ్ ఈవోగా ఉన్నారు.. అలాంటి బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న అధికారి ఇలా పుష్కరణిలో దేవునికి అభిషేకం చేసే సమయంలో ఈత కొట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
నీలకంఠేశ్వర ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది.. ఆలయం నీలకంఠేశ్వర రూపంలో శివునికి అంకితం చేశారు. ఈ ఆలయం 15వ శతాబ్దంలో కాకతీయ రాజవంశం నిర్మించబడింది.. ఈ ప్రాంతంలోని పురాతన దేవాలయాలలో ఒకటిగా పరిగణిస్తారు స్థానికులు. ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది.. ఈ ఆలయం 2000లో పునర్నిర్మాణం చేశారు