AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సెక్రటేరియట్‌ అగ్నిప్రమాదంపై హైకోర్టులో పిల్‌

హైదరాబాద్‌: సెక్రటేరియట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని కేఏ పాల్‌ కోరారు. ఈ మేరకు హైకోర్టులో దాఖలు చేసిన పిల్స్‌ను విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారని నేడు మరోసారి చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌లో మెన్షన్‌ చేశారు.

సెక్రటేరియట్‌ ను క్రైమ్‌ జోన్‌ గా గుర్తించాలని, నూతన సెక్రటేరియట్‌ ను సీజ్‌ చేసి విచారణ జరిపించాలని ఆయన కోరారు. సెక్రటేరియట్‌లో జరిగిన ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక నరబలి ఏమైనా జరిగిందా అనే విషయంపై విచారణ చేపట్టాలన్నారు.

పాల్‌ దాఖలు చేసిన పిల్‌ కి నంబరింగ్‌ ఇవ్వాలని రిజిస్టార్‌ని బెంచ్‌ ఆదేశించింది. సెక్రెటేరియట్‌ ప్రారంభోత్సవం కేసీఆర్‌ పుట్టిన రోజు కాకుండా, అంబేడ్కర్‌ పుట్టిన రోజున ప్రారంభోత్సవం చేయాలని కేఏ పాల్‌ మరో పిల్‌ వేశారు. పాల్‌ వేసిన రెండు పిల్స్‌ పై గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

ANN TOP 10