AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మార్గదర్శకులుగా మారండి.. ఉపాధ్యాయుల సదస్సులో ప్రధాని

గుజరాత్‌లోని గాంధీనగర్ ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పర్యటించారు. ఇక్కడ పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ యూనియన్ కన్వెన్షన్‌లో ప్రధాని మోదీ పాల్గొని.. ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, త‌న‌కు గుజ‌రాత్‌లో ఉంటూ ప్రైమ‌రీ టీచ‌ర్ల‌తో పాటు రాష్ట్రంలోని మొత్తం విద్యా వ్య‌వ‌స్థ‌ను మార్చిన అనుభ‌వం త‌న‌కు వ‌చ్చిందని అన్నారు. నేటి తరం విద్యార్థుల ఉత్సుకత, ఉత్సాహం కొత్త సవాలును తీసుకొచ్చాయని.. ఈ విద్యార్థులు పూర్తి విశ్వాసంతో, నిర్భయంగా ఉంటున్నారని అన్నారు. వారి స్వభావం ఉపాధ్యాయుడిని సాంప్రదాయక విద్యా పద్ధతుల నుంచి బయటకు వచ్చేలా సవాలు విసురుతున్నాయని అన్నారు.

ఒకప్పుడు గుజరాత్‌లో డ్రాప్ అవుట్ రేటు 40% ఉండేదని, నేడు అది 3% కంటే తక్కువకు తగ్గిపోయిందని ప్రధాని అన్నారు. గుజరాత్ ఉపాధ్యాయుల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. గుజరాత్ ఉపాధ్యాయులతో నాకున్న అనుభవం జాతీయ స్థాయిలో కూడా విధానాలను రూపొందించడంలో మాకు ఎంతగానో తోడ్పడింది.ఉదాహరణకు, ఈ కారణాల వల్ల చాలా మంది బాలికలు చదువు మానేశారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు లేకపోవడం.. వదిలేస్తున్నారు అందుకే పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మించాలని ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించామన్నారు ప్రధాని మోదీ.

ప్రధాని ఏమన్నారంటే..
గుజరాత్‌లో ఉన్నప్పుడు ప్రాథమిక ఉపాధ్యాయులతో కలిసి రాష్ట్ర విద్యావ్యవస్థ మొత్తాన్ని మార్చిన అనుభవం ఉంది. ఆ సమయంలో డ్రాప్ అవుట్ నిష్పత్తి 40 శాతంగా ఉంది. నేడు అది 3 శాతం కంటే తక్కువగా ఉంది. ఉపాధ్యాయుల సహకారంతో ఇది సాకారం అయిందన్నారు. గుజరాత్‌లోని ఉపాధ్యాయులతో తనకు ఉన్న అనుబంధం జాతీయ స్థాయిలో బాగా సహాయపడిందన్నారు ప్రధాని మోదీ.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10